నా బిడ్డకు ఇద్దరు తండ్రులు.. యువతి ఫిర్యాదు

తన కడుపులో పెరుగుతోన్న బిడ్డకు ఇద్దరు వ్యక్తులు కారణమంటూ పోలీస్ స్టేషన్‌కెక్కింది ఓ యువతి. తనపై ఆ ఇద్దరు పలుమార్లు అత్యాచారం చేశారని.. ఇప్పుడు తన బిడ్డకు ఆ ఇద్దరూ తండ్రులు అవుతారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షాక్ తిన్న పోలీసులు ఆమెను మోసగించినందుకు గానూ ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంటర్‌తో చదువును మానేసి.. వ్యవసాయ కూలీ పనులకు […]

నా బిడ్డకు ఇద్దరు తండ్రులు.. యువతి ఫిర్యాదు
Follow us

| Edited By:

Updated on: Dec 19, 2019 | 7:52 PM

తన కడుపులో పెరుగుతోన్న బిడ్డకు ఇద్దరు వ్యక్తులు కారణమంటూ పోలీస్ స్టేషన్‌కెక్కింది ఓ యువతి. తనపై ఆ ఇద్దరు పలుమార్లు అత్యాచారం చేశారని.. ఇప్పుడు తన బిడ్డకు ఆ ఇద్దరూ తండ్రులు అవుతారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షాక్ తిన్న పోలీసులు ఆమెను మోసగించినందుకు గానూ ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంటర్‌తో చదువును మానేసి.. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తితో ఆమెకు చనువు ఏర్పడింది. అయితే ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రామారావు ఆ యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన పైడిరాజు అనే మరో వ్యక్తి.. తండ్రిదండ్రులకు చెప్పేస్తానంటూ బెదిరించి ఆ యువతిపై అనేక సార్లు లైంగిక దాడి చేశాడు. ఇక యువతిలో శారీరక మార్పులు గమనించిన కుటుంబసభ్యులు ఆమెను నిలదీయడంతో.. అసలు విషయం చెప్పుకొచ్చింది. వెంటనే వైద్య పరీక్షలు చేయించగా.. అందులో ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. ఇక కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు బాధితురాలు చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామారావు, పైడిపల్లి తనను లైంగికంగా దోచుకున్నారని.. తన కడుపులో పెరుగుతోన్న బిడ్డకు వారే కారణమని, ఆ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్న చీపురుపల్లి పోలీసులు దర్యాప్తును చేపట్టారు.