విశాల్ని మోసం చేసిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు
సామాన్యులే కాదు ప్రముఖులు కూడా పలుమార్లు మోసపోతుంటారు. అందులో సినిమా వాళ్లు మినహాయింపేం కాదు. తాజాగా యాక్షన్ హీరో విశాల్ని ఓ మహిళ మోసం చేసింది.
సామాన్యులే కాదు ప్రముఖులు కూడా పలుమార్లు మోసపోతుంటారు. అందులో సినిమా వాళ్లు మినహాయింపేం కాదు. తాజాగా యాక్షన్ హీరో విశాల్ని ఓ మహిళ మోసం చేసింది. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏ విషయంలో విశాల్ మోసపోయారంటే..!
ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే, మరోవైపు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ కింద ఈ నటుడు సినిమాలను నిర్మిస్తారన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ కంపెనీ మేనేజర్ హరి చెన్నైలోని వడాపలాని పోలీస్ స్టేషన్లో ఓ మహిళపై ఫిర్యాదు చేశారు. తమ కంపెనీలో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తోన్న ఓ మహిళా ఉద్యోగి పలుమార్లు కంపెనీని తప్పుదోవ పట్టించి డబ్బులను తీసుకుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఆ మహిళ 45లక్షలతో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందని, తమ కంపెనీని నుంచి తస్కరించిన డబ్బుతోనే ఆమె ఆ ఇంటిని కొనుగోలు చేసిందని రాజా వెల్లడించారు. ఇక ఈ ఫిర్యాదును విరుగమ్బక్కమ్ స్టేషన్కు ఫార్వర్డ్ చేసినట్లు వడపలాని ఎస్సై తెలిపారు. కాగా విశాల్ చక్ర అనే చిత్రంలో నటించగా.. ఈ మూవీ త్వరలో ఆన్లైన్లో విడుదల అవ్వనుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై అంచనాలను పెంచేసింది.