విశాఖలో హై అలర్ట్.. క్రికెటర్లకు పొంచిఉన్న ఉగ్రముప్పు
టీమిండియా- సౌత్ ఆఫ్రికా క్రికెటర్లకు ఉగ్రముప్పు పొంచి ఉందంటూ ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో విశాఖ నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ను టార్గెట్ చేస్తూ.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టుపక్కల అణువణువు తనిఖీలు చేపడుతున్నారు. అటు విశాఖ తీరంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. కోస్ట్గార్డ్, నేవీలతో మెరైన్ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. కాగా, […]
టీమిండియా- సౌత్ ఆఫ్రికా క్రికెటర్లకు ఉగ్రముప్పు పొంచి ఉందంటూ ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో విశాఖ నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ను టార్గెట్ చేస్తూ.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టుపక్కల అణువణువు తనిఖీలు చేపడుతున్నారు. అటు విశాఖ తీరంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. కోస్ట్గార్డ్, నేవీలతో మెరైన్ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. కాగా, ఇటీవలే కోస్టల్ ప్రాంతాల మీదుగా దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.