కరోనా ల్యాబ్లోనే తయారైంది..నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు..
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనావైరస్ మహమ్మారి సహజంగా రాలేదని.. ల్యాబ్లో తయారు చేసినదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు. ” మనం కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ సహజంగా వచ్చినది కాదు. ల్యాబ్లో తయారుచేసినది. ప్రపంచ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. . వీలైనంత త్వరగా […]
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనావైరస్ మహమ్మారి సహజంగా రాలేదని.. ల్యాబ్లో తయారు చేసినదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు.
” మనం కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ సహజంగా వచ్చినది కాదు. ల్యాబ్లో తయారుచేసినది. ప్రపంచ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. . వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. అని నితిన్ గడ్కరీ, వ్యాఖ్యానించారు.
కరోనా విపత్కర పరిస్థితులు తీసుకురావడం వల్ల పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన అంశంపై స్పందించిన గడ్కరీ… ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అనుకూలతలు క్రియేట్ చెయ్యడం సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ఇండియా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు సన్నద్ధంగానే ఉందని అభిప్రాయపడిన గడ్కరీ.. ధైర్యంగా వైరస్ను ఎదిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా చైనాలోని ఓ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందని ప్రపంచంలోని చాలా దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్, జర్మనీ వంటి దేశాలూ కరోనా గురించి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. భారత్ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఏ విధమైన కామెంట్స్ చెయ్యలేదు. అయితే తొలిసారిగా భారత ప్రభుత్వంలోని భాగస్వామ్యమైన ఓ వ్యక్తి చైనాపై ఈ విధంగా విమర్శలు చేయడం సంచలనమైంది.