మీకెమైనా పిచ్చా.. ఫ్యాన్స్‌ వార్‌పై మండిపడ్డ సెహ్వాగ్‌

ఇటీవల కొల్హాపర్‌ జిల్లా కురుంద్వాద్‌లో క్రికెటర్లు ధోని, రోహిత్ శర్మ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ఓ వ్యక్తిని చెరుకుతోటకు తీసుకెళ్లి

మీకెమైనా పిచ్చా.. ఫ్యాన్స్‌ వార్‌పై మండిపడ్డ సెహ్వాగ్‌
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 12:46 PM

virender sehwag fires on fans: ఇటీవల కొల్హాపర్‌ జిల్లా కురుంద్వాద్‌లో క్రికెటర్లు ధోని, రోహిత్ శర్మ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ఓ వ్యక్తిని చెరుకుతోటకు తీసుకెళ్లి అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో స్పందించి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీకు ఏమైనా పిచ్చా.. మేమంతా కలిసి జట్టుగా దేశం కోసం ఆడుతాం. ఒకరికి ఒకరం పెద్దగా మాట్లాడుకోకపోయినా, ఎవరిపని వారు చేసుకుంటూ గెలుపు కోసం కృషి చేస్తాం. కానీ కొందరు అభిమానులు ఇలా హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడూ ఇలా గొడవపడకండి. టీమిండియా అంతా ఒక్కటే ఇది గుర్తుపెట్టుకోండి అని ఘాటుగా ట్వీట్ చేశారు. ఇక సెహ్వాగ్ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ”కరెక్ట్ సర్‌.. బాగా చెప్పారు సర్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More:

నాగార్జున సాగర్ వద్ద 144 సెక్షన్‌ విధింపు

 ‘జాంబీ రెడ్డి’ ఎవరో తెలిసిపోయింది