హోం క్వారంటైన్ ఉల్లంఘిస్తే.. భారీ జరిమానా తప్పదట!
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్ విషయంలో పలు నిబంధనలను విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ రూల్ ను ఉల్లంఘించిన వారికి రూ. 2,000 జరిమానాను విధిస్తామని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులును జారీ చేసింది. మొదటిసారి హోం క్వారంటైన్ రూల్ ను అతిక్రమిస్తే రెండు వేలు ఫైన్ వేస్తామని.. అదే రెండోసారి ఉల్లంఘిస్తే మాత్రం.. ఆ వ్యక్తిని ప్రభుత్వం […]
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్ విషయంలో పలు నిబంధనలను విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ రూల్ ను ఉల్లంఘించిన వారికి రూ. 2,000 జరిమానాను విధిస్తామని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులును జారీ చేసింది.
మొదటిసారి హోం క్వారంటైన్ రూల్ ను అతిక్రమిస్తే రెండు వేలు ఫైన్ వేస్తామని.. అదే రెండోసారి ఉల్లంఘిస్తే మాత్రం.. ఆ వ్యక్తిని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కరోనా లక్షణాలు ఉన్నవారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితంగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 7,261 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడి 313 మంది చనిపోయారు.
Read More:
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..
CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..
ఆన్లైన్ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!
విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్సైట్..