ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇప్పటికైనా వారికి సాంత్వన కలిగించండి
ఢిల్లీలో మంగళవారం జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన ఘటనపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
ఢిల్లీలో మంగళవారం జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన ఘటనపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదని, అన్నదాతలు చేస్తున్న డిమాండుపై ఇప్పటికైనా కేంద్రం స్పందించి వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని ఆయన కోరారు. హింస వల్ల దేన్నీ సాధించలేమన్నారు.అటు- రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు జరుగుతుండగానే మెల్లగా ఢిల్లీ లోని వివిధ మార్గాల గుండా రైతులు నగరంలోకి ప్రవేశించి తమ నిరసనలను ఉధృతం చేశారు. సింఘు, ఘాజీపూర్, టిక్రి బోర్డర్లలో శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని ఢిల్లీ పోలీసులకు హామీ ఇఛ్చిన వారు… ఆ తరువాత ఒక్కసారిగా సిటీలోకి, అటు తరువాత ఎర్రకోట వద్దకు పరుగులు తీశారు. వీరి నిరసనలో పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ, ఖలిస్థాన్ శక్తులు ప్రవేశించి ర్యాలీని భంగపరచవచ్చునని, హింస చేలరేగవచ్చునని ఢిల్లీ పోలీసులు నిన్ననే ఊహించారు. ఈ మేరకు వారు ఈ శక్తులను అడ్డుకోవడానికి ప్రతిపాదనలను కూడా సిధ్ధం చేశారు. కానీ గణ తంత్ర దినోత్సవ వేడుకల బందోబస్తులో పలువురు పోలీసులు ఉన్న నేపథ్యంలో.. మంగళవారం పెద్ద సంఖ్యలో ఉన్న ప్రొటెస్టర్ల దూకుడును తక్కువ మంది ఖాకీలు నిలువరించలేకపోయారు.
Read Also:నెలరోజులకు చేరిన రైతుల ఆందోళన, ఢిల్లీలోని టిక్రీ సరిహద్దుతో పాటు సింఘు బోర్డర్, ఢిల్లీ – ఘజియాబాద్ సరిహద్దుల్లో కోలాహలం. Read Also:కొత్త సంవత్సరంలో కొత్త నిబంధనలు… జనవరి 1 నుంచి మారబోతున్న నిబంధనలు మీకు తెలుసా..?