దారి తప్పి గ్రామంలో ప్రత్యక్షమైన జింక.. కుక్కుల బారి నుంచి కాపాడిన గ్రామస్థులు..
కరోనా కాలంలో కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడవిలో ఉన్న జంతువులన్నీ రోడ్లపైకి.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజగా..
కరోనా కాలంలో కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడవిలో ఉన్న జంతువులన్నీ రోడ్లపైకి.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజగా చిత్తూరు జిల్లాలోని మాధవరం గ్రామంలో కూడా ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. అడవిలోకి వెళ్లాల్సింది పోయి.. దారి తప్పి గ్రామంలోకి ఎంటర్ అయ్యింది. దీంతో గ్రామంలో ఉన్న కుక్కలు అరవసాగాయి. అంతేకాదు.. దానిపై దాడి చేయబోయాయి. అయితే దీనిని గమనించిన గ్రామస్థులు వెంటనే ఆ జింకను కాపాడారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో దానిని పెట్టి.. కుక్కల బారిన పడకుండా రక్షించారు. ఆ తర్వాత విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపారు. దీంతో వారు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. గ్రామానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు.. ఆ జింకకు చికిత్స చేసి.. తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేశారు.