కేంద్రం కీలక నిర్ణయం…’ఉపాధి హామీ’ జాబితాలోకి గ్రామీణ పారిశుద్ధ్య పనులు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనుల జాబితాలోకి పారిశుద్ధ్య సంబంధ పనులను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనుల జాబితాలోకి పారిశుద్ధ్య సంబంధ పనులను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల, అంగన్వాడీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఇకమీదట ఈ స్కీమ్ కింద చేపట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. వీటిని ప్రత్యేకంగా నిర్మించుకోవచ్చు లేదా వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలయ్యే గవర్నమెంట్ పథకాలతో కలిపి గానీ నిర్మించడానికి వీలు కల్పించింది. స్వచ్ఛభారత్ మిషన్తో కలిపి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.