వికాస్ దూబే అలా చేస్తాడనుకోలేదు..భార్య రిచా దూబే

తన భర్త వికాస్ దూబే మానసిక స్థితిపై అతని భార్య రిచా దూబే మొదటిసారిగా స్పందించింది. పూర్తి యాంగ్జైటీ (మానసిక ఒత్తిడి) కారణంగా గత మూడు, నాలుగు సంవత్సరాలుగా అతడు మందులు వాడుతూ వచ్చాడని ఆమె పోలీసులకు..

వికాస్ దూబే అలా చేస్తాడనుకోలేదు..భార్య రిచా దూబే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 25, 2020 | 11:11 AM

తన భర్త వికాస్ దూబే మానసిక స్థితిపై అతని భార్య రిచా దూబే మొదటిసారిగా స్పందించింది. పూర్తి యాంగ్జైటీ (మానసిక ఒత్తిడి) కారణంగా గత మూడు, నాలుగు సంవత్సరాలుగా అతడు మందులు వాడుతూ వచ్చాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఎనిమిది మంది పోలీసులను వికాస్ దూబే, అతని సహచరులు హతమార్చిన విషయాన్ని తాను టీవీ ద్వారానే చూసి షాక్ తిన్నానని ఆమె వెల్లడించింది. ఆ రోజున తనను, తమ పిల్లలను.. ఇల్లు వదిలి వెళ్లిపొమ్మని వికాస్ చెప్పాడని, దాంతో వెంటనే తాము అలా వెళ్లిపోయామని రిచా దూబే పేర్కొంది. (గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కాన్పూర్ లో జులై 10 న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన సంగతి తెలిసిందే). తన కార్యకలాపాల గురించి దూబే ఏనాడూ తమతో మాట్లాడేవాడు కాదని రిచా చెప్పింది. తన పిల్లలు తన భర్తలా కాకుండా సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారని ఆశిస్తున్నట్టు ఆమె వెల్లడించింది. అతడి ఎన్ కౌంటర్ ను పరోక్షంగా సమర్థించింది. ఈ ప్రభుత్వం మంచి పనే చేసిందని ఆమె వ్యాఖ్యానించింది.