ఆ తండ్రీ కొడుకులు చేయగలిగిందేమీ లేదు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయలేదన్న విజయసాయిరెడ్డి

రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారం అనే వస్త్రాలను విడిచేసి చంద్రబాబు నగ్నంగా చెలరేగిపోతున్నారని విజయసాయి..

ఆ తండ్రీ కొడుకులు చేయగలిగిందేమీ లేదు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయలేదన్న విజయసాయిరెడ్డి
Follow us

|

Updated on: Jan 23, 2021 | 4:14 PM

ఏపీలో పంచాయితీ ఎన్నికల వివాదం చెలరేగుతూనే ఉంది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారం అనే వస్త్రాలను విడిచేసి చంద్రబాబు నగ్నంగా చెలరేగిపోతున్నారని విజయసాయి రెడ్డి ట్విట్ట ద్వారా విమర్శించారు. కళ్లు, చెవులు మూసుకుని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో అని ఎద్దేవా చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టి కూడా కరోనా భయంతో తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రచారానికి వెళ్లలేదని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మీ కంటే పెద్దవాళ్లు క్యూలో నిల్చుని ఓట్లు వేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో చెప్పిస్తున్నారని ట్విట్టర్‌ వేదికగా దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలకు విలువే లేదా? అని ప్రశ్నించారు.