బెజవాడ రెడ్ జోన్ ప్రాంతంలో వివాహ వార్షిక వేడుక..కేసు బుక్ చేసిన పోలీసులు
ఇది కరోనావైరస్ అల్లకల్లోలం చేస్తోన్న టైమ్. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రభుత్వాలు ప్రకటించిన రెడ్ జోన్స్ పరిధిలో మరింత అప్రమత్తత అవసరం. అయితే విజయవాడలోని వన్ టౌన్ ప్రాంతంలోని రెడ్ జోన్ ఏరియాలో వివాహ వార్షిక వేడుక నిర్వహించారు. దీనికి కొందరు స్థానిక నేతలు కూడా హాజరయ్యారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో..దానికి హాజరైన స్థానిక నేతలతో పాటు నిర్వాహకులపైనా 1వ పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. పోలీసులు […]
ఇది కరోనావైరస్ అల్లకల్లోలం చేస్తోన్న టైమ్. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రభుత్వాలు ప్రకటించిన రెడ్ జోన్స్ పరిధిలో మరింత అప్రమత్తత అవసరం. అయితే విజయవాడలోని వన్ టౌన్ ప్రాంతంలోని రెడ్ జోన్ ఏరియాలో వివాహ వార్షిక వేడుక నిర్వహించారు. దీనికి కొందరు స్థానిక నేతలు కూడా హాజరయ్యారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో..దానికి హాజరైన స్థానిక నేతలతో పాటు నిర్వాహకులపైనా 1వ పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం అర్ధరాత్రి పాతబస్తీలోని 52వ డివిజన్లో కొందరు స్థానిక నాయకులు వివాహ వార్షిక వేడుక నిర్వహించారు. అయితే ఆ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉండటంతో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. వారు నిబంధనలు అతిక్రమించినందుకుగాను మొత్తం 8 మంది నాయకులపై కేసును నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసినట్లు సీఐ చెప్పారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఎవరూ ఎలాంటి వేడుకలు నిర్వహింకూడదని, ఆదేశాలు బేఖాతరు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.