తండ్రితో ఎంట్రీ.. తనయుడితో రీఎంట్రీ

సూపర్‌స్టార్ మహేశ్ బాబు 26వ సినిమా ప్రారంభమైంది. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ తదుపరి చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీకి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. విజయశాంతి మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రెస్‌నోట్‌ను పంపించగా.. దానిని దర్శకుడు అనిల్ రావిపూడి మీడియా సమావేశంలో చదివి వినిపించారు. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘కిలాడి […]

తండ్రితో ఎంట్రీ.. తనయుడితో రీఎంట్రీ
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 1:38 PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు 26వ సినిమా ప్రారంభమైంది. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ తదుపరి చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీకి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. విజయశాంతి మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రెస్‌నోట్‌ను పంపించగా.. దానిని దర్శకుడు అనిల్ రావిపూడి మీడియా సమావేశంలో చదివి వినిపించారు. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘కిలాడి కృష్ణుడు’ చిత్రం ద్వారా తాను టాలీవుడ్‌కు పరిచయం అయ్యానని.. ఇప్పుడు దాదాపు 13సంవత్సరాల తరువాత మహేశ్ బాబు మూవీ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నానని ఆమె పేర్కొన్నట్లు అనిల్ తెలిపారు. ఇక మహేశ్ బాబుతో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపినట్లు ఆయన చెప్పారు. కాగా ఈ మూవీలో మరో కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారని.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడని అనిల్ రావిపూడి తెలిపారు.