కర్ణాటకలో కాంగ్రెస్కు మరో ఝలక్..
కర్ణాటకలో ఇప్పటికే చిక్కుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బళ్లారి జిల్లాలోని విజయ్నగర్ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ బీ సింగ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఆనంద్ సింగ్కు కేబినెట్లో చోటు కల్పిస్తారని మొదటి నుంచి వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన […]
కర్ణాటకలో ఇప్పటికే చిక్కుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బళ్లారి జిల్లాలోని విజయ్నగర్ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ బీ సింగ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఆనంద్ సింగ్కు కేబినెట్లో చోటు కల్పిస్తారని మొదటి నుంచి వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు కేబినెట్ విస్తరణ జరిగింది. అయినప్పటికీ ఆనంద్ సింగ్కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.