విజయసాయికి మరో కీలక పదవి..ఈ సారి కేంద్ర ప్రభుత్వం నుంచి
న్యూఢిల్లీ : వైసీపీ ట్రబుల్ షూటర్, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి లభించింది. దేశంలోని తొమ్మిది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ల సభ్యులుగా తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు గురువారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇందులో భాగంగా విజయసాయిరెడ్డి మంగళగిరి(గుంటూరు) ఎయిమ్స్ సభ్యునిగా ఎంపికయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఏపీలో ఎయిమ్స్ ఉండడం… దాని పర్యవేక్షించేలా స్థానిక నేత అవసరం ఉండడంతో ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న […]
న్యూఢిల్లీ : వైసీపీ ట్రబుల్ షూటర్, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి లభించింది. దేశంలోని తొమ్మిది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ల సభ్యులుగా తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు గురువారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇందులో భాగంగా విజయసాయిరెడ్డి మంగళగిరి(గుంటూరు) ఎయిమ్స్ సభ్యునిగా ఎంపికయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఏపీలో ఎయిమ్స్ ఉండడం… దాని పర్యవేక్షించేలా స్థానిక నేత అవసరం ఉండడంతో ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి ఎయిమ్స్ కు సభ్యునిగా నియమించారు