Vijaya dairy: మళ్లీ పెరిగిన ‘విజయ’ పాల ధరలు.. రెండు నెలల్లోనే 2 సార్లు
Vijaya dairy: విజయ పాల ధరలు మళ్ళీ పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధరలను మళ్లీ పెంచారు. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రెండు నెలల క్రితమే లీటరు ధరను రూ.2 పెంచింది. మళ్లీ ఇప్పుడు రూ.3 పెంచడం గమనార్హం. తాజా పెంపుతో విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. 2 నెలల వ్యవధిలోనే లీటరుకు రూ.5 పెంచడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రైవేటు డెయిరీలకు, విజయ పాలకు కేవలం రూ.1 […]
Vijaya dairy: విజయ పాల ధరలు మళ్ళీ పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధరలను మళ్లీ పెంచారు. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రెండు నెలల క్రితమే లీటరు ధరను రూ.2 పెంచింది. మళ్లీ ఇప్పుడు రూ.3 పెంచడం గమనార్హం. తాజా పెంపుతో విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. 2 నెలల వ్యవధిలోనే లీటరుకు రూ.5 పెంచడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రైవేటు డెయిరీలకు, విజయ పాలకు కేవలం రూ.1 మాత్రమే తేడా ఉండడంతో విజయ పాల మార్కెట్ దెబ్బతినే అవకాశం లేదంటున్నారు.
కాగా.. టోన్డ్ పాలు లీటరుకు రూ.47, హోల్ మిల్క్ లీటరుకు రూ.61, డైట్ మిల్క్ లీటరు రూ.41, స్టాండర్డైజ్ పాలు రూ.51, ఆవుపాలు రూ.47, టీ స్పెషల్ మిల్క్ రూ.45 చొప్పున ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రైవేటు డెయిరీలు జనవరిలోనే పాల ధరలు పెంచేశాయి. ప్రస్తుతం విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. ప్రస్తుతం ధరల పెరుగుదలతో ప్రైవేటు డెయిరీలకు, విజయ డెయిరీకి ఉన్న తేడా తగ్గిపోయింది.
విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. పాడి రైతులకు ధర పెంచడానికే వినియోగదారులపైనా భారం వేయాల్సి వచ్చిందని డెయిరీ ఫెడరేషన్ వెల్లడించింది. పెరిగిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇతర డెయిరీల పాలు 36 లక్షల లీటర్లు అమ్ముడుపోతున్నాయి. ధరలు పెంచిన నేపథ్యంలో రెండు నెలల క్రితం రోజుకు 3.12 లక్షల లీటర్ల పాలు అమ్ముడు పోయేవి. మిగతా సంస్థలతో పోలిస్తే లీటరుకు రూ.4 తక్కువ ఉండడంతో వినియోగదారులు కొనేవారు. ప్రస్తుతం 2.50 లక్షల లీటర్ల పాల విక్రయాలు మాత్రమే జరుగుతున్నట్లు సమాచారం.