Vijay Devarakonda: నా సినిమా ఎవరు చూస్తారనుకున్నా… అభిమానుల హంగామాపై ఎమోషనల్‌ అయిన ‘రౌడీ’..

ijay Emotional Post: 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌'లో ఓ చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ. తర్వాత నాని హీరోగా తెరకెక్కిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో నటన విషయంలో తెలుగు ప్రేక్షకులను..

Vijay Devarakonda: నా సినిమా ఎవరు చూస్తారనుకున్నా... అభిమానుల హంగామాపై ఎమోషనల్‌ అయిన 'రౌడీ'..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 11:29 AM

Vijay Emotional Post: ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌’లో ఓ చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ. తర్వాత నాని హీరోగా తెరకెక్కిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో నటన విషయంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక అర్జున్‌ రెడ్డితో ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా మారాడు విజయ్‌. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ విజయ్‌కి ఫేమ్‌తో పాటు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంత కాదు. రౌడీస్‌ అంటూ అభిమానులను ప్రేమగా పిలుచుకునే విజయ్‌.. వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ కొత్త చిత్రం ప్రకటనతో ఫ్యాన్స్‌ చేసిన హంగామానే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ‘లైగర్‌’ పేరుతో రానున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ ఫ్యాన్స్‌ రచ్చరచ్చ చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఫ్లెక్సీకి పూల దండలు వేసి హంగామా చేశారు. అభిమానులు తనపై చూపిన ప్రేమకు పొంగిపోయిన విజయ్‌ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌వేదిక ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. అభిమానుల కోలాహలానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘నిన్న మీరు చేసిన పనికి నేను చాలా ఎమోషనల్‌ అయ్యాను. మీ ప్రేమ నా మనసును తాకింది. ఒకప్పుడు అనుకునేవాడిని.. నా పనితనాన్ని ఎవరు గుర్తిస్తారు? నా సినిమా ఎవరు చూస్తారు? అని! కానీ నిన్న కేవలం లైగర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసినందుకే రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణాన్ని సృష్టించి నన్ను కదిలించారు. ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి.. మీరు టీజర్‌ కోసం వెయిట్‌ చేయండి. దేశమంతా పిచ్చెక్కించడం గ్యారెంటీ.. ప్రేమతో మీ విజయ్‌ దేవరకొండ” అని రాసుకొచ్చాడు.

అభిమానులను ఉద్దేశిస్తూ విజయ్ చేసిన పోస్ట్ ఇదే..

View this post on Instagram

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Also Read: Minissha Lamba: బంధం బలంగా లేకుంటే విడిపోవడం మంచిది.. అది పెద్ద నేరమేమి కాదంటున్న ప్రముఖ నటి..

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు