ప్యాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ డిజైరబుల్ మెన్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌లో అతనికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. కేవ‌లం తెలుగులోనే కాదు నేషనల్ లెవల్‌లో కూడా విజయ్ త‌న ఇమేజ్ పెంచుకున్నాడు.

ప్యాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ డిజైరబుల్ మెన్
Follow us

|

Updated on: Aug 22, 2020 | 4:10 PM

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌లో అతనికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. కేవ‌లం తెలుగులోనే కాదు నేషనల్ లెవల్‌లో కూడా విజయ్ త‌న ఇమేజ్ పెంచుకున్నాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్ హీరోగా క్రేజీ ఫీట్ అందుకున్న‌ విజయ్ ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేశాడు.

తాజాగా ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్స్ లిస్ట్‌లో విజయ్ ఏకంగా మూడు స్థానం ద‌క్కించుకున్నాడు. ఫ‌స్ట్ ప్లేసులో షాహిద్ కపూర్, సెకండ్ ప్లేసులో రణ్‌వీర్‌సింగ్‌ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ థర్డ్ ప్లేసులో నిలిచాడు.

గ‌తంలో హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా వరుసగా 2018, 2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు‌ రౌడీ స్టార్. ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ పాగా వేయ‌డం అత‌డి క్రేజ్‌కు నిద‌ర్శ‌నం. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !

బాస్ బ‌ర్త్ డేకు నెల్లూరు కుర్రోళ్ల స్వీట్ గిఫ్ట్‌