ఇకపై రోడ్డు ప్రమాద ఫోటోలు, వీడియోలు తీస్తే రూ. కోటి వరకు జరిమానా !! వీడియో
స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగినప్పటినుంచి ప్రతీ ఒక్కరూ చిన్న సైజ్ న్యూస్ రిపోర్టర్లా మారిపోయారు. ఏ చిన్న సంఘటన జరిగినా సరే వెంటనే జేబులోని స్మార్ట్ ఫోన్ను తీసి చిత్రీకరిస్తున్నారు.
స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగినప్పటినుంచి ప్రతీ ఒక్కరూ చిన్న సైజ్ న్యూస్ రిపోర్టర్లా మారిపోయారు. ఏ చిన్న సంఘటన జరిగినా సరే వెంటనే జేబులోని స్మార్ట్ ఫోన్ను తీసి చిత్రీకరిస్తున్నారు. తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న వ్యక్తిని గాలికి వదిలేసి స్మార్ట్ ఫోన్లో వీడియో తీయడమే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే ఇకపై ఇలా ప్రమాదాలను చిత్రీకరించడం నేరంగా భావిస్తామని చెబుతోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం. ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రమాదానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరిస్తే కఠినంగా శిక్షించేందుకు వీలుగా సైబర్ క్రైమ్ చట్టాన్ని యూఏఈ సవరించింది.
Also Watch:
కాసేపట్లో పెళ్లి.. సడెన్గా మండపంలోకి అంబులెన్స్ ఎంట్రీ !! వీడియో
ViralVideo: పెళ్లి పీటలపైనే !! వధూవరుల వింతపంచాయతీ !! వీడియో
Viral Video: నెలల నిండు గర్భంతో పురుషుడు !! నోరెళ్లబెడుతున్న జనం !! వీడియో