Nepal: విధిరాత అంటే ఇదేనేమో.. కలతలు తీరి కలిసే సమయానికి తీరని విషాదం..
నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులందరూ చనిపోయినట్లు ఇవాళ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులందరూ చనిపోయినట్లు ఇవాళ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ భారతీయ ఫ్యామిలీ కథ విషాదాంతమైంది. దశాబ్దాలుగా కుటుంబ కలహాలతో విడిగా ఉంటున్న ఓ జంట.. కలతలు తీరి అంతా ఏకమయ్యే సమయానికి ఆ కుటుంబాన్ని విధి మరోలా వెంటాడింది. అశోక్ కుమార్ త్రిపాఠి, ఆయన భార్య వైభవి నిజానికి ఎప్పుడో విడిపోయారు. దూరంగా ఉంటున్న ఆ జంట మళ్లీ ఒక్కటి కావాలనుకున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కలిసి అశోక్ ఫ్యామిలీ నేపాల్ టూర్కు వెళ్లింది. కానీ విమాన ప్రమాద రూపంలో ఆ ఫ్యామిలీ శాశ్వతంగా అందరికీ దూరమైది. అశోక్ త్రిపాఠీ ఒడిశాలో కంపెనీ నడిపారు. ఇక వైభవి భండేకర్ త్రిపాఠి ముంబైలోని బీకేసీ వద్ద ఓ కంపెనీలో పనిచేసిసారు. ఆ ఇద్దరూ కోర్టు ఆదేశాల ప్రకారం కొన్నాళ్ల క్రితం విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు. అంతా కలిసి థానే సిటీలోని బాల్కమ్ ప్రాంతంలో ఉన్న రుస్తుమ్జీ ఏథెనా అపార్ట్మెంట్లో ఆమె నివసిస్తున్నారు. వైభవి తల్లి 80 ఏళ్ల బామ్మ ఇంట్లోనే ఉంటున్నారు.కానీ విమాన ప్రమాద ఘటన గురించి ఆమెకు ఏమీ తెలియదు. పొఖారా సిటీ నుంచి టేకాఫ్ తీసుకున్న తారా ఎయిర్లైన్స్ విమానంలో అశోక్, వైభవి జంట ఉన్నారు. ముస్తాంగ్ జిల్లాలో ఉన్న కొండల్లో ఆ విమానం ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీలతో పాటు ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!