Viral: ఈ బస్సు డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఫైర్.. అసలు ఏ జరిగిందంటే ??
ఇటీవల బస్సు డ్రైవర్లు, లోకో పైలట్లు చిత్రి విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. మొన్నామధ్య ఓ లోకో పైలట్ తనకిష్టమైన చేపలు కొనుక్కోడానికి రైల్వే గేటు దగ్గర ట్రైన్ ఆపేసాడు.
ఇటీవల బస్సు డ్రైవర్లు, లోకో పైలట్లు చిత్రి విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. మొన్నామధ్య ఓ లోకో పైలట్ తనకిష్టమైన చేపలు కొనుక్కోడానికి రైల్వే గేటు దగ్గర ట్రైన్ ఆపేసాడు. అతను చేపలు కొనుక్కొని వచ్చేంతవరకూ గేటు దగ్గర ఇరువైపులా ఉన్న వాహనదారులు రైలు ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూశారు. తాజాగా అలాంటి ఘటనే మరోటి జరిగింది. ఇక్కడ ఓ బస్సు డ్రైవర్ టీ తాగడం కోసం నడిరోడ్డుమీద బస్సు ఆపేసాడు. ఈ క్రమంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బస్సు డ్రైవర్ తనకెంతో ఇష్టమైన టీ తాగడం కోసం నడిరోడ్డుపై బస్సు ఆపేసి రోడ్డుకు అవతలవైపున ఉన్న దుకాణంలో టీతాగి తాపీగా బస్సులోకి వెళ్లాడు. ఈ ఘటన అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డ్రైవర్ బాధ్యతారాహిత్యంపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.
Also Watch:
బైక్పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్ ట్విస్ట్ !!
ఎయిర్పోర్ట్లో మానవ పుర్రెల కలకలం.. షాక్లో అధికారులు
50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!