30 years ago Tomb: తన సమాధిని 30 ఏళ్ల క్రితమే కట్టుకున్నాడు.. 85వ ఏట ఆ సమాధిలోనే.. వైరల్ అవుతున్న వీడియో..
ఆయనకప్పుడు 55 ఏళ్లు.. తన సమాధిని తానే కట్టాలనుకున్నాడు. తాను చనిపోతే అందులోనే అంత్యక్రియలు చేయాలని తన కుటుంబ సభ్యులకు సూచించాడు.
ఆయనకప్పుడు 55 ఏళ్లు.. తన సమాధిని తానే కట్టాలనుకున్నాడు. తాను చనిపోతే అందులోనే అంత్యక్రియలు చేయాలని తన కుటుంబ సభ్యులకు సూచించాడు. అనుకున్నట్లుగానే.. శ్మశాన వాటికలో తన సమాధిని తానే స్వయంగా నిర్మించుకున్నాడు. ఇటీవల ఆయన తన 85వ ఏట ప్రాణాలు కోల్పోయాడు. అయితే, నాటి తన కోరిక మేరకు ఆ వృద్ధుడి అంత్యక్రియలను ఆ సమాధిలోనే చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ తాలూకాలోని నంజేదేవన్పూర్లో ఈ ఘటన వెలుగు చూసింది.పుట్టనంజప్ప 85 ఏళ్ళ వయసులో సహజ మరణం పొందారు. అయితే, పుట్టనంజప్ప 30 ఏళ్ల క్రితమే తన సమాధిని నిర్మించుకున్నారు. సమాధిని సిమెంటు, ఇటుకతో తనకు నచ్చిన రీతిలో నిర్మించుకున్నారు. అతని కోరిక మేరకు పుట్టనంజప్ప అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. పుట్టనంజప్పకు ముగ్గురు పిల్లలు. పిల్లలు కష్టపడకూడదని తన అంత్యక్రియలకు, తిథి పనులకు లక్ష రూపాయల నగదు ముందుగానే దాచి పెట్టుకున్నాడు. అంత్యక్రియలకు అవసరమైన పూజా సామగ్రిని కూడా తానే కొనిపెట్టుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..