Telangana: కొమరంభీం జిల్లా శివారులో భయం భయం.. వెళ్లాలంటే జనాలు దడుసుకుంటారు

Updated on: Nov 04, 2025 | 9:11 AM

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పులి పాదముద్రలు గుర్తించారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. మీరూ షాక్ అవుతారు.

కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి పాదముద్రలు గుర్తించినట్లు అటవిశాఖ అధికారులు తెలిపారు. నందిగూడ, వంజిరి, బురదగూడ, గొల్లగూడ, చారీగాం గ్రామల ప్రజలు అప్రమత్తంగా హెచ్చరించారు. పశువుల కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రాకూడదని సూచిస్తున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లొదని… పులి సంచరించిన ఆనవాళ్లు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పులి సంచారంతో శివారు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే పులి వల్ల పశువులు, మనుషులకు ఎలాంటి హాని జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.