భారత నారీ..విజయ భేరీ వీడియో
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకుపోయింది. జెమీమా అద్భుత సెంచరీ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 88 పరుగులతో రాణించారు. అజేయంగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి, భారత్ ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుంది.
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్లో టీమిండియా సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. బలమైన ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసి, ముచ్చటగా మూడోసారి ఫైనల్కు దూసుకుపోయింది. ముంబై వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో, తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 338 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయవంతంగా ఛేదించింది.
మరిన్ని వీడియోల కోసం :
