విజయవాడలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కూటమి ప్రభుత్వం వెంటనే సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం 100రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై షర్మిల కామెంట్స్ చేశారు.