ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా సత్యసాయి జిల్లాలో కూలీలతో కలిసి పనిచేశారు. పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, నిధుల కేటాయింపులో మార్పులు చేసి రాష్ట్రాలపై భారం మోపుతోందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఈ పథకాన్ని ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని షర్మిల ఆరోపించారు.