మీ భూమిలో విలువైన నిధి దొరికిందా? అప్పుడు అది ఎవరికి చెందుతుంది? ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ 1878 ప్రకారం, పది రూపాయల కంటే ఎక్కువ విలువైన ఏ వస్తువు దొరికినా అది ప్రభుత్వానికే చెందుతుంది. జిల్లా కలెక్టర్కు వెంటనే సమాచారం ఇవ్వాలి. నిధి పురాతనమైనదైతే పూర్తిగా ప్రభుత్వ సొంతమవుతుంది. నిబంధనలు పాటించని వారికి జరిమానా, జైలు శిక్ష విధిస్తారు.