కాకినాడ జిల్లా సర్పవరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్ముకుని షార్ట్కట్ కోసం వెళ్లిన కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వైజాగ్ నుండి కాకినాడ వస్తున్న వెంకట పద్మావతి, దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ ప్రదీప్ ప్రాణాలతో బయటపడ్డాడు.