మామిడి పండ్లను తినే ముందు కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఫైటిక్ యాసిడ్ తొలగిపోవడంతో పాటు, పండులోని అదనపు వేడి తగ్గి, పురుగుల మందులు, రసాయనాలు శుభ్రపడతాయి. ఇది మొటిమలు, జీర్ణ సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు సూచిస్తున్నారు.