తెలంగాణలోని అశ్వారావుపేట మున్సిపాలిటీ పదో వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఓటు వేయలేదని ఓటర్లతో వాగ్వాదానికి దిగారు. ఓటుకు డబ్బు, కుక్కర్లు పంపిణీ చేసి, ఎన్నికల తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేసి కుక్కర్లను వెనక్కి విసిరేశారు.