నల్గొండ జిల్లాకు చెందిన బాచిపల్లి రాజేష్, నేపాల్కు చెందిన సుజిత థాపా దుబాయి, కెనడాలలో ఏడేళ్లు కలిసి పనిచేశారు. ప్రేమలో పడి, తాజాగా నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అనంతరం స్థానిక వెంకటేశ్వరాలయంలో సాంప్రదాయ పద్ధతిలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.