అయోధ్య రామ మందిరంలో శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముడి విగ్రహ నుదిటిపై సూర్య తిలకం దర్శనమిచ్చి భక్తులను ఆహ్లాదపరిచింది. శాస్త్రవేత్తల ప్రత్యేక ఏర్పాటుతో ప్రతి సంవత్సరం ఈ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఈ సందర్భంగా ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.