రన్నింగ్లో ఉన్న రైతులో పాము కనిపించడంతో ప్రయాణీకులు హడలెత్తిపోయారు. జబల్పుర్ - ముంబై గరీబ్రత్ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులు భయంతో పక్క కోచ్లోకి వెళ్లిపోయారు. రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. పాముని పట్టుకుని బయట వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.