వర్షాలు లేక అల్లాడుతున్న సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరి గ్రామ ప్రజలు, సంప్రదాయ బండజారుడు పాయసం పూజను నిర్వహించారు. సంజీవరాయని గుట్టపై ఆంజనేయ స్వామి ఆలయంలో వివిధ పాలు కలిపి వండిన పాయసాన్ని కోనేటిలో వదిలి, అందులో స్నానమాచరించి, సస్యశ్యామలం కావాలని దేవుడిని వేడుకున్నారు