మేడారం జాతర పూర్తవడంతో సమ్మక్క-సారలమ్మ ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. ఈ లెక్కింపులో డబ్బులు, నగలతో పాటు చిత్రవిచిత్రమైన వస్తువులు, ముఖ్యంగా భక్తులు రాసిన లేఖలు బయటపడుతున్నాయి. లెక్కింపు సిబ్బంది ఈ అనూహ్య దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు.