బంగారం, వెండి ధరలు పడిపోయిన నేపథ్యంలో, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మార్కెట్ క్రాష్లను ధనవంతులు, పేదవారు ఎలా చూస్తారో వివరించారు. ధరల పతనాన్ని ధనవంతులు కొనుగోలు అవకాశంగా భావించి, వెండి, బంగారం కొనేందుకు సిద్ధపడతారు. దీనిని ఆయన సేల్గా అభివర్ణించారు. పేదవారు మాత్రం భయపడి అమ్మేస్తారని కియోసాకి తన ట్వీట్లో పేర్కొన్నారు.