తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల కిడ్నాప్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును కొట్టివేయాలని నిందితులుగా ఉన్న మోహన్ బాబు, మంచు విష్ణు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు ఉధృతం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.