జమ్ము కశ్మీర్లో పాకిస్తాన్ రేంజర్ల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ అనే తెలుగు జవాన్ మృతి చెందాడు. యుద్ధభూమిలో మరణించిన మురళి నాయక్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతదేహం మే 10న స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది.