గుప్త నిధులు తీసిస్తానంటూ మంత్రాల హుసేని అనే మంత్రగాడు ఒక కుటుంబాన్ని మోసం చేశాడు. నాలుగు తులాల బంగారం, రెండు లక్షల రూపాయల నగదు తీసుకుని సుమారు ఎనిమిది లక్షల రూపాయల సొమ్ము కాజేశాడు. మోసం బయటపడటంతో బాధితులు ప్రశ్నించగా బెదిరించాడు. చివరకు నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.