సంతానం కోసం ఎదురుచూస్తున్న యాదాద్రి జిల్లా దంపతులను కేరళ యునాని వైద్యుడి వేషంలో వచ్చిన ఓ దొంగ బాబా మోసం చేశాడు. శక్తివంతమైన తైలం రాసుకోవాలంటూ నమ్మించి, ఒంటిపై ఉన్న బంగారం తీయమని చెప్పి, వారు స్నానానికి వెళ్లిన సమయంలో ఆ నగలతో ఉడాయించాడు. బాధితులు పోచంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.