తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి హైటెన్షన్ వైర్ల సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా సృష్టించాడు. కేరళ ఎక్స్ప్రెస్ ప్రయాణికుడైన అతడి చర్యతో రైళ్ల రాకపోకలు రెండున్నర గంటల పాటు నిలిచిపోయాయి. అగ్నిమాపక, రైల్వే సిబ్బంది చాకచక్యంగా అతడిని రక్షించారు. అయితే, వ్యక్తి తన వివరాలు చెప్పడానికి నిరాకరించడం గమనార్హం.