వనపర్తి జిల్లాలో ఓ నాగుపాము నీటి పైపులో ఇరుక్కుని అపస్మారక స్థితికి చేరింది. కుర్రోళ్ల గ్రామానికి చెందిన రైతు సుదర్శన్ సమాచారంతో వనపర్తి స్నేక్ సొసైటీ సభ్యులు పామును రక్షించి సీపీఆర్ చేశారు. అనంతరం నీరు అందించి, ఎండ నుంచి ఉపశమనం కోసం ఏసీ కారులో ఉంచి, కోలుకున్నాక పొదల్లో విడిచిపెట్టారు.