మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లార్డ్గంజ్ పోలీసులు ఒక వినూత్న చర్యతో వార్తల్లో నిలిచారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఓ కారును పోలీస్ స్టేషన్కు తరలించి, పారిపోకుండా సంకెళ్లు వేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, స్టేషన్లో గొలుసులు లేకపోవడంతోనే సంకెళ్లు వేసినట్లు సంబంధిత క్లర్క్ తెలిపారు.