మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన బృందంతో కలిసి అమరావతిలో పర్యటిస్తున్నారు. బిల్ గేట్స్ టీమ్ సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులను బిల్ గేట్స్కు పరిచయం చేశారు. ఆరోగ్యం, విద్యా, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయాలపై చర్చించనున్నారు. సీఎం డేటా ఆధారిత పాలన, ఆర్టీజీఎస్ వ్యవస్థపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.