ఏపీలో దాదాపు అన్ని జిల్లాలకు విపత్తుల నిర్వహణ శాఖ మూడు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలను సూచించింది. శుక్ర, శనివారాల్లో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. చెట్ల కింద ఉండవద్దని ప్రజలకు సూచించారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది.