అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. యూపీలోని జైతీపూర్కు చెందిన మేజర్ జంట సహజీవనంపై దాఖలైన కేసులో, వివాహబంధం సహజీవనానికి అడ్డుకాదని కోర్టు స్పష్టం చేసింది. సమాజం నైతికతను ప్రశ్నించినా, చట్టం ప్రకారం ఇది నేరం కాదని, మేజర్ల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని తీర్పునిచ్చింది.