వైరల్ వీడియో: ప్రమాదానికి ముందు.. ఏం జరిగిందంటే..?
తూర్పుగోదావరి జిల్లా గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ప్రమాదానికి 5 నిమిషాల ముందు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు బోటులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడి దృశ్యాలను వీడియో తీసి తమ స్నేహితులకు షేర్ చేశారు. ఆ వీడియోలో అందరూ ఎంతో ఉత్సాహంగా.. నీటిలో వెళుతున్న బోటుపై ఆనందంగా ఆటపాటలతో సరదాగా ఉన్నారు. అయితే పడవ లోపల ఉన్నవారెవరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నట్లు […]
తూర్పుగోదావరి జిల్లా గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ప్రమాదానికి 5 నిమిషాల ముందు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు బోటులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడి దృశ్యాలను వీడియో తీసి తమ స్నేహితులకు షేర్ చేశారు. ఆ వీడియోలో అందరూ ఎంతో ఉత్సాహంగా.. నీటిలో వెళుతున్న బోటుపై ఆనందంగా ఆటపాటలతో సరదాగా ఉన్నారు. అయితే పడవ లోపల ఉన్నవారెవరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నట్లు వీడియోలో కనిపించలేదు. లైఫ్ జాకెట్లు ధరించి వుంటే ప్రాణాలతో అయినా ఉండేవారని తెలుస్తోంది. అయితే ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కాగా ఇప్పటివరకూ 12 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, 315 అడుగుల లోతులో బోటు మునిగిపోయినట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి.