ప్రగతి భవన్‌‌లో శునకం మృతి.. వైద్యుడిపై కేసు నమోదు

సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లో హస్కీ అనే ఓ పెంపుడు శునకం మృతిచెందింది. ఈ నెల 10వ తేదీన 11నెలల హస్కీ అనారోగ్యానికి గురైంది. దీంతో ప్రగతి భవన్‌ డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌ అలీఖాన్‌.. రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ వైద్యుడు వచ్చి చికిత్స అందించాడు. తీవ్రంగా జ్వరం ఉండటంతో లివర్‌ టానిక్‌ ఇచ్చాడు. అనంతరం హస్కీ పరిస్ధితి మరింత విషమించింది. దీంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 4లో యానిమల్‌ కేర్‌ […]

ప్రగతి భవన్‌‌లో శునకం మృతి.. వైద్యుడిపై కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 12:00 PM

సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లో హస్కీ అనే ఓ పెంపుడు శునకం మృతిచెందింది. ఈ నెల 10వ తేదీన 11నెలల హస్కీ అనారోగ్యానికి గురైంది. దీంతో ప్రగతి భవన్‌ డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌ అలీఖాన్‌.. రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ వైద్యుడు వచ్చి చికిత్స అందించాడు. తీవ్రంగా జ్వరం ఉండటంతో లివర్‌ టానిక్‌ ఇచ్చాడు. అనంతరం హస్కీ పరిస్ధితి మరింత విషమించింది. దీంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 4లో యానిమల్‌ కేర్‌ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అయితే డాక్టర్ చికిత్స చేస్తుండగా ఆ కుక్క మరణించింది. దీంతో డాగ్స్ హ్యాండ్లర్ ఆలీఖాన్.. యానిమల్ కేర్ క్లినిక్ వైద్యుడైన రంజిత్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే కుక్క మృతిచెందిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, బహదూర్‌పురాకు చెందిన ఆసిఫ్‌ అలీఖాన్‌ ఐదేళ్లుగా ప్రగతి భవన్‌ డాగ్‌ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొత్తం 9 పెంపుడు కుక్కలకు సంరక్షణ చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు.