బాలీవుడ్ మరో విషాదం.. ఆయన ఇక లేరు
గత కొద్ది కాలం నుంచి అనారోగ్యంతో కొంతమంది, కరోనాతో మరికొంత మంది బాలీవుడ్ నటులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పాటల రచయిత అన్వర్ సాగర్(70) మరణించారు. స్థానిక కోకిలాబెన్ థీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో...
గత కొద్ది కాలం నుంచి అనారోగ్యంతో కొంతమంది, కరోనాతో మరికొంత మంది బాలీవుడ్ నటులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పాటల రచయిత అన్వర్ సాగర్(70) మరణించారు. స్థానిక కోకిలాబెన్ థీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, వైద్యులు తెలిపారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను వెల్లడించలేదు. కాగా ఆయన మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1980-90 లలో అన్వర్ పాటలు ఫుల్ ఫేమస్ అయ్యాయి. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ఖిలాడీ’ చిత్రంలో ఆయన రాసిన రొమాంటిక్ ట్రాక్ సాంగ్ ‘వాదా రహా సనమ్’ సంగతీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.