ప్రముఖ రచయిత, నటుడు రావి కొండల రావు కన్నుమూత
ప్రముఖ రచయిత, నటుడు రావి కొండల రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. 1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో నటుడు రవి కొండల రావు జన్మించారు. 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం..
ప్రముఖ రచయిత, నటుడు రావి కొండల రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. 1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో నటుడు రవి కొండల రావు జన్మించారు. 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. పాఠశాల చదువంతా కాకినాడలో సాగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్గా కొన్ని రోజులు ఆయన పని చేశారు.
తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలైంది.. ఫిబ్రవరి 6 అయితే.. రావికొండలరావు పుట్టింది ఫిబ్రవరి 11న. రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాతే విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్గా చేశారు. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. నటుడిగా, జరల్నిలిస్ట్గా, కాలమిస్ట్గా ఎన్నో పాత్రలను పోషించారు. ఈయన మద్రాసులో నాటకాలు వేస్తుంటే.. బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, పి.పుల్లయ్య వంటి వారు వచ్చి వీక్షించేవారు.
Read More:
ప్రయాణికులకు గుడ్న్యూస్ః ఇకపై మరింత ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్..
ఏడో నిజాం కుమార్తె బషీరున్నిసా బేగం మృతి
రామ్ గోపాల్ వర్మకు షాక్.. రూ.4 వేల ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..